ప్రజా సంక్షేమానికి భరోసా ఇవ్వలేని వై.సీ.పీ. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఐదేళ్ల వై.సీ.పీ. అసమర్థ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబడ్డారు. రాజధాని పేరుతో సీ.ఎం. మూడుముక్కలాట ఆడారని విమర్శంచారు. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామని జగన్ ప్రకటించడం ఆయన అత్యాశకు నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా వై.సీ.పీ. నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు.