తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… తిరుపతి నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒకే వ్యక్తి పేరుపై మూడునాలుగు ఓట్లు ఉండటంపై ప్రస్తావించారు. తిరుపతిలో వై.సీ.పీ. లోక్ సభ ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ చేస్తుందని… దాన్ని మూడు పార్టీలూ సమర్ధంగా ఎదుర్కోవలని సూచించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే వేలకొద్దీ బోగస్ ఓట్లు ఉన్నాయనీ వాటిపై ఎన్నికల కమిషన్ దృష్టికి ఉమ్మడి పార్టీలు తీసుకువెళ్ళాయని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు, బీ.జే.పీ. జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
బోగస్ ఓట్లుపై అప్రమత్తంగా ఉండాలి… -పవన్ కళ్యాన్-
![WhatsApp Image 2024-04-13 at 4.58.42 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-13-at-4.58.42-PM.jpeg?resize=1280%2C605&ssl=1)