ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా డీ.ఎస్.పీ. మాట్లాడుతూ… రూ. 27 లక్షలు నగదు, మరో రూ. కోటీ 43 లక్షలు బంగారం చోరీకు గురైనట్లు బ్యాంక్ అధికారులు, పోలీసులు గుర్తించినట్టు తెలిపారు. బ్యాంకు చోరీ నిందితుల్లో కొందరు సామర్లకోట కోటబజార్ ఏరియాలో ఒక ముస్లిం ఇంట్లో పది రోజులు పాటు అద్దెకు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ఆ ఇంటిని పరిశీలించామని వెళ్లడించారు.
ఇలాంటి సందర్బల్లో ఉపయోగ పడే విధంగా సమీపంలో ఉన్న మసీదుల్లో, చర్చిల్లో, దుకాణల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్బంగా ఆయన యజమానులకు సూచించారు. ఈ తరహా బ్యాంక్ రోబరీ పై సామర్లకోటలో విచారణ గంటల తరబడి జరగడంతో కొత్తపేట ప్రజలు ఉత్కంటకు లోనయ్యారు.