![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Mother-tried-to-kill-her-son.jpeg?resize=584%2C1024&ssl=1)
అక్రమ సంబంధం నేపద్యంలో కన్న బిడ్డను చిత్రహింసలకు గురిచేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తితో అక్రమ సంబంధంలో కొనసాగుతున్న ఆ మహిళ తన ఐదేళ్ల కుమారుడి శిరస్సును నీళ్ల బకెట్లో ముంచి ఊపిరాడకుండా హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆయువుతో కొట్టుమిట్టాడే క్రమంలో ఆమె చెరనుంచి ఆ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటనను ఆమె ప్రయుడు రాజేష్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. వెంకటరమణ అనే మహిళ మానసిక స్థితి, ప్రవర్తన సక్రమంగా లేకపోడంతో ఆమె భర్త కొంతకాలంగా విడాకులు కోరుతున్నాడు. అయితే అందుకు నిరాకరించడంతో పాటు, అతడిపై కోపంతో కన్న కొడుకుని చంపాలని చూసింది. ఈ విషయమై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.