కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుంది. ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న ముఖ్యంగా కాకినాడ ప్రజలకు జీవనదిలాంటిది అన్ని పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ చేయవచ్చు.
ఇలాంటి తరుణం లో ఈరోజు ఉదయం 10. 30 గంటలకు స్థానిక గాoది భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశము జరగనుందని దీనికి సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ హాజరవుతున్నారని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ ,సీపీఐ జిల్లా కార్యదర్శి కే. బోడకొండ సముక్తంగా పిలునిచ్చారు. ఈ సమావేశనికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు , ప్రజాసంఘాల నాయకులు వివిధ రంగాల ప్రముఖలు , మేధావులు హాజరవుతూరని మధు తెలిపారు