గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 640 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 4,50,07,212కి పెరిగిందని తెలిపింది. ఒకరు మరణించినట్లు వెల్లడించింది. 311 మంది వ్యాధి నుండి కోలుకున్నారు, కోలుకున్న వారి సంఖ్య 4,44,70,887కి చేరుకుంది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఆసుపత్రి సన్నద్ధత, నిఘా పెంచడం, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి మాక్ డ్రిల్స్తో సిద్ధం కావడం ముఖ్యమని ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కోరారు.