వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే మాట్లాడుతూ… భారతదేశం రాబోయే 25 సంవత్సరాలలో బలమైన వృద్ధిని సాధించే మార్గంలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు గురించి అతను చాలా బుల్లిష్ గా ఉన్నాడని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన తెలిపారు. భారతదేశం రాబోయే 25 సంవత్సరాల పాటు అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నామని బ్రెండే చెప్పారు.
దేశ వృద్ధికి కూడా మద్దతు ఇస్తుందని హైలైట్ చేశారు. గత ఏడాది ప్రపంచ వృద్ధిలో 15 శాతం భారత్ నుంచే వచ్చిందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని చేరుకుంటుందని బ్రెండే ఆశిస్తున్నారు. దేశం అతి త్వరలో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు.
ప్రపంచ వృద్ధిలో 50 శాతం వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుంచి వస్తుందని, వచ్చే దశాబ్దం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. 2040 నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధిలో 60 శాతం వాటాను కలిగి ఉంటాయని, భారతదేశం ముందు నుండి ముందుంటుందని బ్రెండే తెలిపారు.