ప్రస్తుతం మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటీనటులు క్యూలు కట్టడం ప్రారంభించారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన తర్వాత మొదటిసారి ఓటు వేసిన నటుడు అక్షయ్ కుమార్ తన సిరా వేసిన వేలిని బయట ప్రదర్శించాడు. తన పోలింగ్ బూత్ వెలుపల ఉన్న మీడియాతో మాట్లాడుతూ… ఆగస్ట్ 2023లో భారత పౌరసత్వం పొందిన తర్వాత తన మొదటి ఓటు వేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలని, బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని అన్నారు.