Kakinada

భారత రాజ్యాంగం ప్రజలందరి హక్కు… -పిట్టా వరప్రసాద్-

WhatsApp Image 2024-01-26 at 4.00.31 PM

కాకినాడ ఎలివెన్ పేట లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల్లో పూర్తి చేసారన్నారు.
భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయము,స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను అందించిందని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటినుండి అనేక సవరణలు జరిగాయని కానీ నేడు రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించేలా పాలకులు ప్రవర్తించడం దురదృష్టకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో భీరా విజయ్ కుమార్, మామిడి ప్రసాదరావు, పచ్చిపాల సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ