![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Minister-Pinipe-Viswaroop-and-others.jpeg?resize=640%2C288&ssl=1)
సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలకలగా, ఆలయ నంది మండపంలో పండితులు ఆశీర్వచన పూజలు జరిపించారు. మంత్రి వెంట రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కౌన్సిలర్ లు ఉన్నారు.