తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ధారుణ ఘటన జరిగింది. చున్నంబట్టివాడలో ఒక వీది కుక్క వీరంగం సృష్టించింది. తాళ్ళపల్లి ప్రసాద్ అనే వ్యక్తిపై దాడి చేసింది. ఆ దాడిలో అతని చేతి బొటన వ్రేలుని గట్టిగా కొరికి ఆ బొటన వ్రేలుని పట్టుకుపోయింది. ఆ కుక్కని అడ్డకోవలని చూసిన వారిపైన కూడా దాడి చేసింది. ఈ దాడిలో మరో నలుగురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో వ్యక్తిపై వీది కుక్క దాడి…
![a80b8ec8-9155-442a-af08-429ff4f8bc2f](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/a80b8ec8-9155-442a-af08-429ff4f8bc2f.jpg?resize=1080%2C700&ssl=1)