కాకినాడ జల్లా తుని పట్టణంలో స్థానిక కొండవారిపే Coorg టలో మూడు నాలుగు వార్డుల్లో 12 లక్షల రూపాయలతో నూతన నిర్మించిన ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. దాని ప్రారంభించడానికి మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలు పూలమాలతో ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహా లకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.
తరువాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధాబాలు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ నక్క జాన్ బాబు పాల్గొన్నారు.