ఎట్టకేలకు డీఎస్సీ ప్రకటనపై ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రిని, మంత్రి బొత్స సత్యనారాయణని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ 2 మరొక నెల రోజులు వాయిదా వేసి కొత్త సిలబస్ కు సంబంధించిన ప్రామాణికమైన స్టడీ మెటీరియల్ ను ప్రభుత్వం ఉచితంగా అభ్యర్థులకు పంపిణీ చేసి, ఉద్యోగవయోపరిమితి పెంచి, పరీక్ష నిర్వహించాలని, గ్రంధాలయ శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలలో అన్ని ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ త్వరలోనే పరీక్ష తేదీలను వెల్లడించాలని హేమంత్ ప్రభుత్వాన్ని కోరారు.