వేదాంత ఫౌండేషన్ ద్వారా ఎస్. యానం కు చెందిన సొసైటీ మత్స్యకారులకు వలలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వేదాంత ఫౌండేషన్ వారు సుమారు రూ 30 లక్షల వ్యయంతో 6.6 టన్నుల బరువు గల వలలను సమకూర్చడం జరిగిందని వాటిని ఎస్. యానం కు చెందిన 165 మంది సొసైటీ మత్స్య కారులకు స్థానిక క్యాంపు కార్యాలయం నందు పంపిణీ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ , ప్రజా ప్రతినిధులు చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.