కాకినాడ ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మత్స్యకార సమస్యలపై, కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఓఎన్జిసి జనరల్ మేనేజర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెడ్, పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేజీ బేసిన్ కాకినాడ సముద్ర తీరంలో జనవరి 6, 7 వ తేదీల్లో ఓఎన్జిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహజ గ్యాస్ నిక్షేపాలు గూర్చి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దిక్ సింగ్ పూరి వెల్లడించడం జరిగిందని అన్నారు.
ఈ గ్యాస్ వెలికితీతలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో చేపల వేట నిషేధం కాబోతోందని దానికి సంబంధిత సైసిమిక్ సర్వే జరుగుతుండడంతో మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఏ.ఏ.పీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా కార్యదర్శి కృష్ణ మోహన్ మాట్లాడుతూ… కేజీ బేసిన్ సముద్ర గర్భంలో గ్యాస్ నిక్షేపాలు వెలికితీత కార్యక్రమానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ స్టడీ రిపోర్ట్, రిస్కెనాల్సిస్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉంచాలని అన్నారు. అలాగే కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 50 శాతం వాటా ఇవ్వాలని అందులోంచి కాకినాడ జిల్లాకు 10 శాతం వాటా కేటాయించాలని కోరడం జరిగింది కాకినాడ ప్రాంత వాసులకు ఉచితంగా గ్యాస్ సరాఫరా చేయాలని డిమాండ్ చేశామన్నారు.