చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియటంతో మద్యం టెండరు లో అవినీతి జరిగిందని కేసు పెట్టారని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆరోపించారు. అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంద్రపాలెం ధర్నా చౌక్, అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు, తెలుగు దేశం బీ.సీ. కమిటీ నాయకులతో నిరసన ధర్నా చేపట్టారు.
మద్యం టెండర్ల లో చంద్రబాబు తప్పు చేసాడనడం సిగ్గుచేటు…. – కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని-
![WhatsApp Image 2023-11-03 at 7.22.09 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-7.22.09-AM.jpeg?resize=1073%2C700&ssl=1)