అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరి అధ్యక్షతన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మి నాగేంద్ర పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సి.హెచ్ వెంకట్రావు మాట్లాడుతూ… ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా తమ వంతు సహాయం అందించే దిశగా మజ్జిగను తయారు చేసి మండుటెండకు ఎదురెళ్లే వారికి మజ్జిగను అందిస్తున్నారని తెలిపారు.
సేవే మార్గం అంటూ ముందుకు వచ్చిన రెయిన్ బో క్లబ్ అధ్యక్షురాలు బాలా త్రిపురసుందరి సేవలు అభినందనీయమని వారి బృందాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై మునిరెడ్డి మాట్లాడుతూ… అధిక స్థానంలో ఉష్ణోగ్రతలు మండి పడుతున్నందున ప్రజలు అవసరానికి తప్ప బయటకు రావద్దని మరీ అవసరం అయితే ఎండకు అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, మునిరెడ్డి, వెంకట శివ రామకృష్ణ, సతీష్, లక్ష్మి నాగేంద్ర, త్రిపుర సుందరి, ఈశ్వర్, చిన్న మాత రాజు, తదితరులు పాల్గొన్నారు.