News

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ అంబేద్కర్ సేవలకు డి.ఎస్పీ. ఆధ్వర్యంలో సన్మానం…

1000040891

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ కానిస్టేబుల్ దుర్గారావు కుమార్తె గీతా వైష్ణవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ కండిబోయిన వారి శ్రీ స్వచ్చంద సంస్థ మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ సేవలను గుర్తించి డి.ఎస్పీ. మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.

  ఈ సందర్భంగా డి.ఎస్పీ. మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… ఎందరో అనాధ శవాల వద్దకు బంధువులు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న మృతదేహాలను తీసుకెళ్లి ఎటువంటి రుసుము ఆశించకుండా వారికి దహన కార్యక్రమాలు చేయడం పట్ల అంబేద్కర్ ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ఇటువంటి వారిని సన్మానించుకుని వారిని ప్రోత్సహించాలని, ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందిస్తే ప్రోత్సాహంగా ఉంటుందని డి.ఎస్పీ. సూచించారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీ.ఐ. వి. సురేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం