మహారాష్ట్రలో ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశివ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రోడ్డు పైన నిలిపి ఉన్న ఒక వాహనాన్ని అటువైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దానితో ఆ కారు గాల్లో పల్టీలుకొట్టుకుంటూ ఎగిరిపడింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చేందాడు. సమాచామందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాదితుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతు చేందిన వాడు లాతూర్ జిల్లా ఉద్గార్ పట్టణానికి చెందిన మాజీ మేయర్ రాజేశ్వర్ నీతూరే కుమారుడు ప్రసాద్ నీతూరేగా పోలీసు అధికారులు నిర్ధారించారు.