మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్హాపూర్లో నాలుగు రోడ్ల జంక్షన్ లో ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి అటువైపు వస్తున్న నాలుగు బైక్లను వేగంగా ఢీకొట్టింది. వెంటనే ఆ బైకులు గాల్లో లేచి పడ్డాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు ఇద్దరు బైకర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు.