Culture

మహాశక్తి యాగంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే…

WhatsApp Image 2023-12-13 at 5.54.20 PM

మహాశక్తి యాగంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కుటుంభ సభ్యులతో పాల్గొన్నారు. శ్రీపీఠం మహాశక్తి యాగం పూర్ణాహుతితో కనుల పండగగా ముగిసింది. ఈ వేడుకలో దేశం, రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది పాల్గొన్నారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహా కృతవును దిగ్విజయంగా పరిపూర్ణానంద స్వామీజీ రుత్వికులు నిర్వహించారు. నెల రోజులపాటు 100 కోట్ల కుంకుమార్చన చేయాలని తలపిస్తే మూడు రోజులపాటు ప్రకృతి అనుకూలించకపోయినా 111 కోట్లకు కుంకుమార్చన జరిగింది.

బగలాముఖి కోటి తలపిస్తే కోటి 12 లక్షలు జరిగిందని, గాయత్రి 24 లక్షలు జపం తలపిస్తే 29 లక్షలు జరిగిందని, అతిరుద్రం 14641 తలపిస్తే 16 వేల ఎనిమిది వందలు జరిగిందని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. అలాగే చతుర్వేద పారాయణ అనగా 4 వేదాలు సామవేదం ఋగ్వేదం యజుర్వేదం వేదం అధర్వణ వేదం పారాయణ జరిగింది అయన అన్నారు .నక్షత్ర జపం నక్షత్ర హోమాలు అనుకున్న దానికన్నా అధికంగా అయ్యాయని స్వామి ఆనందంతో తెలియపరిచారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది