పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మోటూరి మంగతాయారు పేర్కొన్నారు. స్థానిక మహిళ రీక్రియేషన్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, నలుగురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు శిక్షణలో మరియు ముగ్గుల పోటీ లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంగతాయారు మాట్లాడుతూ… స్త్రీలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడ్డప్పుడే మహిళా సాధికారత లభించినట్లని అన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి చిన్న అవసరానికి ఇంట్లో పురుషులపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. గృహాలకు పరిమితమైన మహిళలకు ఇప్పటివరకు 16 బ్యాచులకు కుట్టు శిక్షణలో శిక్షననిచ్చి వారికి జీవనాధారం కల్పిస్తున్న లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ సేవలు అభినందనీయమని అన్నారు. అదేవిధంగా నాలుగు కుట్టు మిషన్లు సమకూర్చిన డాక్టర్ చంద్రగుప్త, టి.సి. దేవకీ దేవి లను మంగతాయారు అభినందించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎం. ప్రసూన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్బు కార్యదర్శి శ్రీదేవి రెడ్డి, కోశాధికారి శ్రీవాణి, గణేష్ ప్రసాద్ ,వసంత కుమారి, తదితరులు పాల్గొన్నారు.