![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/DIG-Ravi-Kiran.jpg?resize=640%2C394&ssl=1)
- జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్
చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుందని తెలియజేశారు. జైలు చుట్టూ ఐదు వాచ్టవర్స్ ఉన్నాయని, బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు. ప్రతీ గంటకు గార్డ్ సెర్చ్ చేస్తున్నారని, ఈనెల 22వ తేదీన జైలు వాటర్ ట్యాంక్ వైపు ఒక డ్రోన్ తిరిగిందని నార్త్ఈస్ట్ వాచ్టవర్ గార్డు నుంచి మాకు సమాచారం వచ్చిందన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ వరిజినల్ కాదని, అది నకిలీ లేఖగా గుర్తించినట్టు వెల్లడించారు.