ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేలో బోర్ఘాట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బస్సు ట్రక్కు ట్రైలర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారని రాష్ట్ర రహదారి పోలీసు అధికారులు తెలిపారు. బస్సు ముంబై నుంచి పూణె వైపు వెళుతుండగా డ్రైవర్ అదుపు తప్పి ట్రైలర్ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయ పడిన వారిని ముంబైలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు సంగాలి నివాసి రాజు గవాడే (40)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.