ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పిఠాపురంలో ఉదయం స్థానిక సూర్య రాయ విజ్ఞానంద గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సాక రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ హాజరయ్యారు. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు రెండు లక్షల పైగా ఉన్నారని అందులో భాగంగా మున్సిపల్ రంగంలో అధిక స్థాయిలో ఉన్నారని, వీరిని పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం ఆప్కాస్ విధానం తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను నడ్డి విరిచిందని ఆయన వాపోయారు. వారి జీవన విధానాలు ఎదుగు బదులు లేని వారిగా మార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్ మద్దూర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర రంగాల వారిని తక్షణమే పర్మినెంట్ చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులందరికీ నేను అధికారంలోకి రాగానే వారందరినీ పర్మినెంట్ చేస్తానని, నేను విన్నాను-నేను ఉన్నాను అని హామీ ఇచ్చారని గద్దెనెక్కిన తర్వాత మాట మార్చారని, ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీను తక్షణమే అమలు చేయాలని, లేకుంటే 2024 ఎన్నికల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి….
![IMG-20231030-WA0011](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/IMG-20231030-WA0011.jpg?resize=1152%2C519&ssl=1)