రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముమ్మడివరంలో ఎం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయం ముందు అంగన్ వాడీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్ వాడీలు నిరసన చేపట్టి 16 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటీ స్పందన లేదని వాపోయారు. ఎం.ఎల్.ఏ. అక్కడ లేకపోవడంతో వారు జెడ్.పీ.టీ.సీ. కార్యదర్శి కుడిపూడి శంకర రావుకు సమస్యలపై కర పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి జీ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చన హామీలను మరిచిపోయారని అన్నారు. ఈ కార్యాక్రమంలో సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి జీ. దుర్గాప్రసాద్, వ్యవసాయ కార్మికసంఘం నాయకుడు బాలయ్య, అంగన్ వాడీలు, తదితరులు పాల్గొన్నారు.