ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శు క్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తం ప్రకారం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేంచేసియున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ జనసందోహం తో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.