డీఎస్సీ ఉద్యోగాలు 25 వేల పోస్టులతో మెగానోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ. జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు.
గత ప్రభుత్వ కాలంలో 23 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని భర్తీ చేయడం లేదని మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ 25 వేల పోస్టులతో తీస్తామని హామీ ఇచ్చి నేడు నాలుగున్నర సంవత్సరాలు తర్వాత 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అంటే డీఎస్సీ అభ్యర్థులను మోసం చేయడమే అని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసామని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం ఖాళీలు పోస్టులు భర్తీ, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇటువంటి హామీలను అమలు చేయకుండా 99% మేనిఫెస్టో ఎలా అయిందని ప్రశ్నించారు.