ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ నెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ నేతలు తెలిపారు. తదనంతరం రాలీ నిర్వహించి ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఎ.ఆర్.సి. వర్మ లు మాట్లాడుతూ… సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 ను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
దేశవ్యాప్తంగా లక్ష మంది పైగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా జీవనం సాగిస్తున్నారన్నారు. వారిని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ వైద్య రంగానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై జి.ఎస్.టి. పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ మందుల కంపెనీలను మల్లీ పునరుద్ధరించాలని డిమెండ్ చేసారు.