సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తూ… ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎం.పీ. లను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. తన ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాధారిత సంస్కరణలను కొనసాగించడం కోసమని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తన 22 రోజుల మేమంతా సిద్దం ప్రచారాన్ని ముగించిన జగన్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే మంచి పాలనకు ముగింపు పలకడమేనని అన్నారు. తన బస్సుయాత్రలో భాగంగా జరిగిన చివరి బహిరంగ సభలో జగన్ తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు.