Andhra Pradesh

మైక్రో అండ్ స్మాల్ మీడియo, ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పరిశ్రమలకు ప్రోత్సాహం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

WhatsApp Image 2023-10-26 at 6.58.01 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మైక్రో అండ్ స్మాల్ మీడియoఎంట ర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మండల పరిధిలోని మాచవరం గ్రామంలో మహాలక్ష్మి పప్పుధాన్యాల ప్రాసెసింగ్ క్లస్టర్ సెంటర్ లో జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ గ్రామ పరిధిలో విడివిడిగా పప్పు ధాన్యాలు ప్రాసెసింగ్ మూలంగా ఆశించిన గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో సుమారు 15 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సామూహికంగా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మంచి గిట్టుబా టు ధరలు పొందే విధంగా మైక్రోస్మా ల్ మీడియo, ఎంటర్ప్రైజెస్ కింద ఒక క్లస్టర్ యూనిట్ ను నెలకొల్పాలని సంకల్పించి అనుమతులు పొంది ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే యూనిట్ సివిల్ వర్కులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పథకం కింద రూ. 15 కోట్లతో కామన్ ఫెసిలిటేషన్ క్లస్టర్ ప్రాజెక్టు మంజూరయిందని దీనిలో 10% రాష్ట్ర ప్రభుత్వం, 10% లబ్ధిదారులు, మిగిలిన 80 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా సమకూ ర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి, వైయస్ ఆర్సీపీ రైతు విభాగపు కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, క్లస్టర్ డైరెక్టర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీ కే పీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం