రోడ్ ప్రమాదాలను నివారణకు అయినవిల్లి ఎస్ఐ నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు, అందుకు సంబంధించి ఇటీవల నిభందనలు విధించారు. జిల్లాలో జరుగుతున్న పలు ప్రమాదాలు మైనర్లవల్లనేనని గుర్తించిన పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన నివారణ మార్గాల అమలులో భాగంగా కఠిన చర్యలు చేపట్టారు. ఎవరైనా తమ వాహనాలను మైనర్ బాలురు లేదా బాలికలకు ఇచ్చినట్టైతే … ఆ వాహనాన్ని ఇచ్చిన యజమానిపై చర్యలు తీసుకోబోతున్నట్టు ఎస్ ఐ వెల్లడించారు. ఈ నేపద్యంలో ముక్తేశ్వరం సెంటర్ లో మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంత మంది మైనర్లను గుర్తించిన వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. 18 ఏళ్ళు నిండకుండా వాహనాలు నడిపి ప్రమాదాలు కోనితెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. వాహనాలను మైనర్ లకు ఇవ్వొద్దని, ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.