కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఎటిమోగ గ్రామం 16 వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీ.జే.పీ. పార్టీ మేధావుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత దేశాన్ని నిలపాలనే సంకల్పంతోనే ప్రధాన మంత్రి పేదలకు సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు తెలియచేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మోడీ నేతృత్వంలో సంక్షేమం అధికం…
![OIP (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/OIP-1-2.jpg?resize=474%2C608&ssl=1)