కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు మాట్లాడుతూ… ఎంతో కష్టపడి రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర చట్టాన్ని అమలు చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి వారిపై వ్యతిరేతంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దుచేయాలన్నారు. అంతేకాకుండా నిత్యావసర వస్తు ధరలను తగ్గించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల ఆపి ప్రభుత్వ సంస్థలను కాపాడాలని డిమెండ్ చేసారు.