మహా వికాస్ అఘాడీ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ చవాన్లు శనివారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి మద్దతిచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించినా ఆయా చోట్ల ఎం.వీ.ఏ. విజయాలు నమోదు చేసిందనిఎస్.సీ.పీ. కి చెందిన శరద్ పవార్ మండిపడ్డారు. ప్రధానమంత్రి రోడ్షో, ర్యాలీ ఎక్కడ జరిగినా మేము గెలిచాము. అందుకే ప్రధానికి కృతజ్ఞతలు చెప్పడం కర్తవ్యంగా భావిస్తున్నానని శరద్ పవార్ విలేకరుల సమావేశంలో అన్నారు.