గ్రూప్ 2 పరిక్షలు యధావిధిగా ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతాయని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రూప్ 2 వాయిదా వేయించాలని ఏ.పీ. పీఎస్సీ సభ్యులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి శదవిదాలు ప్రయత్నించామని అన్నారు. అయితే పరిక్షలు వాయిదా వేస్తే ఆరు నెలల వరకు మళ్లీ పరీక్ష పెట్టే పరిస్థితి లేదని ఏ.పీ. పీఎస్సీ సభ్యులు తేల్చి చెప్పారన్నారు. కావున ఉన్న సమయాన్ని వినియోగించుకొని గ్రూప్ 2 పరిక్షలకు సిద్ధం కావాలని విద్యార్ధులకు సూచించారు.