కాకినాడ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించారు. ఈ స్పందన కు అధిక సంఖ్యలో అర్జీదారులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్న వించుకున్నారు. అయితే సుమారు రెండు వారాల అనంతరం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు హాజరు కాకపోవడంతో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ డి.ఎం. పుష్పమణి మరో ఇద్దరు అధికారుల సారథ్యంలో అర్జీదారులను సేకరించారు. ఆ విజ్ఞాపన పత్రాలను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తక్షణం సమస్యను పరిష్కరించి అర్జిదారులకు న్యాయం చేయాలని డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణి , సివిల్ సప్లై కార్పొరేషన్ ఎం.డి. పుష్ప మణి అధికారులకు సూచించారు.