కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండలంలో అక్రమ మద్యాన్ని ఐ. పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు వాహనాల తనికీలు చేపట్టారు. ఆ తనికీల్లో ఒక కారులో రూ. 1.48, 680 విలువుగల మద్యం బాటిల్లు కనిపించడంతో వాటిని పట్టుకొని సీజ్ చేసారు. ఇందులో 750ఎం.ఎల్. పరిమాణం గల 180 మాన్షన్ హౌస్ బాటిల్స్, అదే విదంగా 48 రాయల్ స్టాగ్ బాటిల్స్, 120 రాయల్ స్టాగ్ 375 ఎం.ఎల్. బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్.ఐ. రాజేష్ వెళ్లడించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యానాం నుంచి తరలిస్తుండగా మద్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు పాల్పడిన గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన డొక్కు సుబ్బరాజు, అంకిశెట్టి బాలాజీలను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పట్టువేతలో ఐ. పోలవరం ఎస్.ఐ. రాజేష్, కానిస్టేబుల్స్, ఎక్సేజ్ సిబంది ఉన్నారు.