![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/Vote-for-Barrelakka.jpg?resize=640%2C403&ssl=1)
నిరుద్యోగ యువతకు చట్టసభల్లో స్థానం దక్కించుకోవాలంటే యువతరం మేలుకుని బర్రెలక్క@శిరీషాను గెలిపించుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి నిరుద్యోగ యువతి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం నిరుద్యోగ యువతారాని ప్రతిష్టాత్మక విషయమన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విసిగి వేసారి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చట్టసభల్లో నిరుద్యోగుల గొంతుకై నిలవడానికి బర్రెలక్క సాహసోపేత నిర్ణయం తీసకున్నారని వెల్లడించారు. ప్రతి ఓటరు శిరీషకు ఓటేసి గెలిపించి చరిత్ర తిరగరాయాలని హేమంత్ కుమార్ అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు నిరుద్యోగ యువతకు రానున్న ఎన్నికల్లో 10 సీట్లు కేటాయించి అభివృద్ధి నిరూపించుకోవాల్సిందిగా ఆయన సవాల్ విసిరారు. విశాఖపట్నం గ్రంథాలయం వద్ద ప్లకార్టులు చేతపట్టి శిరీషకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. హేమంత్ కుమార్తో పాటు నడుపల్లి సతీష్, సనపల తిరుపతిరావు, కే నాయుడు, మల్లేష్, జానకిరామ్, లక్ష్మీ సుజాత తదితరులు పాల్గొన్నారు.