ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ప్రశ్నించే విధంగా చైతన్యం హెచ్.ఏ. సంకల్పంతో ఏర్పడిన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్నిఈ నెల 20 వ తేదీన దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కాకినాడ లక్ష్మీనారాయణ రోడ్డులో ఉన్న తెలుగు నవ గర్జన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నీటి రాజకీయ వ్యవస్థ లో సమూల ప్రక్షాళన చేసే విధంగా తెలుగు నవగర్జన పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్టీ అజెండా మేనిఫెస్టో విషయాలను తెలియజేసేందుకు ఈ మహా సభను నిర్వహిస్తునట్లు వెళ్లడించారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా… మా పార్టీ మాత్రం యువత కోసం ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భావం రోజునే మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.