కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం యండపల్లి వాసులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబుకిఘన స్వాగతం పలికారు. అక్కడకి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన నాగబాబుకి రామాలయం సెంటర్ నుండి వినాయకుడి గుడి సెంటర్ వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయకుడి గుడి సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. వై.సీ.పీ. నాయకులు పాలన రాష్ట్రంలో ప్రతీ పౌరుడిని విసుగు చెందించిందని అన్నారు. జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రణాళికతో పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి మత్సా అప్పాజీ, మురాలశెట్టి సునీల్ కుమార్, మత్సా శ్రీనివాసరావు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
యు. కొత్తపల్లి మండలంలో నాగబాబు కి ఘన స్వాగతం…
![WhatsApp Image 2024-04-22 at 8.49.15 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-8.49.15-AM.jpeg?resize=1296%2C700&ssl=1)