సంఘసంస్కర్తగా, విద్యావేత్తగా, పవిత్రతకు సంకేతంగా బ్రహ్మర్షిగా భారతదేశంలోని తెలుగు ప్రాంతాల్లో పేరుపోందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు 85 వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆంద్రా కాపు సద్బావనా సంఘం తరపున ఆద్యక్షులు బసవా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శేతు మాధవరావు, దామిశేట్టి శ్రీనివాసు తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా క్రీడా మైదానం వద్ద గల వేంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాసు మాట్లాడుతూ… 1862 అక్టోబర్ 1 వ తేదీన మచిలీపట్నం లో జన్మించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడ ప్రాంతంలో ప్రముఖ సంఘసంస్కర్త గా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 1904 లో పి.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ గా బాద్యతలు చేపట్టి 1911 లో తొలిసారి కాకినాడలో బాలికలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనన్నారు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు కు ఘనంగా 85 వ వర్ధంతి వేడుకలు…
![51001d18-7137-4fc4-b000-b4a1ccc72647](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/51001d18-7137-4fc4-b000-b4a1ccc72647.jpg?resize=1110%2C540&ssl=1)