ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా, వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డీ.తిప్పేనాయక్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడీ రామారావు, వికాస మ్యానేజర్ పీ.శ్రీకాంత్, వికాస సంస్థ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.