కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై 10 దాటితే తీవ్రంగా మారుతుందని తెలిపారు. వీరి లక్ష్యం నిర్మానుషంగా ఉన్న రోడ్ల లలో వంటరిగా వెళ్లేవారే అని తెలిపారు. వారికి ఆడ, మగా అనే బేధం లేదు చేతిలో రాడ్, బ్లేడు చూపించి సెల్ ఫోన్ లు, డబ్బులు, నగదు దొచుకిపోతున్నారని వెళ్లడించారు. ముఖ్యంగా కాకినాడ ఆర్టీసీ బస్టాండ్, భానుగుడి పాత బ్రిడ్జి క్రింద వనమాడి కొండబాబు రోడు, కొండయ్యపాలెం కొత్త బ్రిడ్జి క్రింద, పల్లం రాజు నగర్, జగన్నాధపురం ఏరియా, బీచ్ రోడ్డు, అశోక్ నగర్ మరియు గుడారిగుంట ఇంకా చాలా ప్రాంతాలలో వీరి సంచారం తీవ్రంగా ఉందని తెలిపారు.