డా. బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జె.ఎన్. 1 వేరియెంట్ పెరుగుతున్న దృష్య రాష్ట్ర ప్రజలు దానిపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే అందరూ… సామాజిక దూరం పాటించాలి, మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తదనంతరం శిభిరానికి వచ్చిన వారిని పరిక్షించి రోగులకు ఉచ్చిత మందులు పంపిణీ చేశారు. ఈ శిభిరానికి దాదాపు 650 మందికి పైగా వచ్చారని తెలిపారు. ఈ కార్య క్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఈతా ప్రసాద్, కొయ్య బంగారు బాబు, బుల్లబ్బులు, తదితరులు పాల్గొన్నారు