డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇంచార్జ్ బత్తుల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
తొలత మహాపురుషుల చిత్రపటాలను పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి జ్యోతిని వెళిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు కామేశ్వరరావు, భక్తులు చినబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సద్యరావు, నియోజకవర్గ ట్రజరర్ పోతుల జీవ, మహిళా అధ్యక్షురాలు కొత్తివేళ్ళ మేరీ, సీనియర్ నాయకులు సుబ్బారావు శర్మ, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు.