జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్కు రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న ఆయన రావులపాలెం చేరుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, తదితర నాయకులు గజమాలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం చేరుకున్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన వీరాభిమాని, క్రీయాశీల సభ్యుడు బండారు వెంకటరాజు కుటుంభాన్ని పరామర్శించారు. కుటుంభ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సలహామేరకు రూ.5 లక్షల భీమా చెక్కును పార్టీ నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధిత కుటుంభానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకున్నవారికి ఎల్లవేళలా పార్టీ భరోసానిస్తుందన్నారు.