Political

రావులపాలెంలో నాదేండ్లకు ఘన స్వాగతం… – అభిమాని కుటుంభాన్ని ఆదుకున్న జనసేన పార్టీ

WhatsApp Image 2023-10-18 at 3.27.03 PM

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌కు రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న ఆయన రావులపాలెం చేరుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్‌, వేగుళ్ల లీలాకృష్ణ, తదితర నాయకులు గజమాలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం చేరుకున్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన వీరాభిమాని, క్రీయాశీల సభ్యుడు బండారు వెంకటరాజు కుటుంభాన్ని పరామర్శించారు. కుటుంభ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ సలహామేరకు రూ.5 లక్షల భీమా చెక్కును పార్టీ నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధిత కుటుంభానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకున్నవారికి ఎల్లవేళలా పార్టీ భరోసానిస్తుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.