రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడలో మాట్లాడాలని నిర్ణయించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కన్నడ భాషను ప్రతి కన్నడిగుడు తప్పక కాపాడుకోవాలని అన్నారు. కర్నాటకలో ఏ ఇతర భాష మాట్లాడకుండా మాతృభాషలోనే మాట్లాడాలని, రాష్ట్ర వాసులు ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. కర్ణాటకలో నివసించే వారితో కన్నడలో మాట్లాడాలని అందరూ నిర్ణయించుకోవాలన్నారు.
కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలన్నారు. కన్నడిగులు ఉదారంగా ఉంటారు అందుకే ఇతర భాషలు మాట్లాడే వారు కూడా కన్నడం నేర్చుకోకుండా జీవించే వాతావరణం కర్ణాటకలో ఉందన్నారు. తమిళనాడు, ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించదని అన్నారు. వారు తమ మాతృభాషలో మాత్రమే మాట్లాడతారని చెప్పారు.