Peddapalli

రాష్ట్ర అభివృద్ధికే లోకేష్ శంఖారావం కార్యక్రమం…

OIP (18)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి చెరనుండి రాష్ట్రాన్ని విడిపించేందుకు ఈ నెల 11 వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన శంఖారావం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోచుకొని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి, అతని బృందానికి మాత్రమే దక్కుతుందని అన్నారు. వై.సీ.పీ. పట్ల ఇప్పటికే ప్రజలు విసిగు చెందారని రాష్ట్ర ప్రజలందరికీ నేను ఉన్నాను అంటూ భరోసాగా నిలుస్తున్న తమ నాయకుడు లోకేష్ కు అందరం అండగా నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు యావత్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

Avatar

Simhadri Penke

About Author