కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ మాత్యులు నితిన్ గట్కారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ సంబంధిత అధికారులకు ప్రతిపాదనలనకు సంబంధించి రిపోర్టు తయారు చేయవలసినదిగా ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ కలిసారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ అభివృద్ధిపై చర్చించి రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది.
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి… -వంగా గీతా విశ్వనాథ్-
![WhatsApp Image 2023-12-21 at 9.14.39 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-9.14.39-PM.jpeg?resize=841%2C700&ssl=1)